శ్రీశైలానికి శివస్వాములు పోటెత్తుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు కర్నాటక నుంచి పెద్ద ఎత్తున కాలినడకన శివ స్వాములు నిత్యం ఇక్కడికి వస్తున్నారు. ప్రతి ఏటా ఇక్కడికి శివస్వాములు మాలధారణతో కాలినడకన వస్తూనే ఉన్నారు. తాజాగా .. బషీరాబాద్ మండలం నీళ్లపల్లి, జలాల్పూర్, రుద్రారం గ్రామాలకు చెందిన శివ స్వాములు శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి దర్శించుకోవడానికి పాదయాత్రతో బయలుదేరారు.