Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: పండగపూట ప్రజల మధ్యన బుగ్గన కుమారుడు అర్జున్ రెడ్డి

Bethamcharla: పండగపూట ప్రజల మధ్యన బుగ్గన కుమారుడు అర్జున్ రెడ్డి

గూటుపల్లె చెరువు మరమ్మతు పనుల పరిశీలన

బేతంచెర్ల మండలంలోని గూటుపల్లె గ్రామ అతి సమీపంలోగల, పురాతన గూటుపల్లె చెరువును ఆర్థిక శాఖ మంత్రి తనయుడు వైసీపీ యువనేత బుగ్గన అర్జున్ రెడ్డి వైసీపీ బృందంతో కలిసి గూటుపల్లె చెరువుకు జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. బుగ్గన అర్జున్ రెడ్డి వెంట బేతంచెర్ల మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు బుగ్గన నాగభూషణం రెడ్డి, సీనియర్ వైసీపీ నాయకులు బాబురెడ్డి, గూటుపల్లె గ్రామ సర్పంచ్ శ్రీరాములు, మాజీ సర్పంచ్ వెంకటస్వామి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

బేతంచెర్ల పట్టణంలోని హనుమాన్ నగర్ లో గల శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని, హనుమాన్ నగర్ కాలనీ వాసులతో మమేకమై సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ శాంతులతో జీవించాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కాలనీ వాసులతో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా అని అడిగారు.

పండుగ రోజు వైసీపీ యువ నాయకులు బుగ్గన అర్జున్ రెడ్డి హనుమాన్ నగర్ రావడం, కాలనీ వాసులతో కలిసి పర్యవేక్షించడం, మాట్లాడటం చాలా సంతోషం కలిగించిందని కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, బేతంచెర్ల నగర పంచాయితి చైర్మన్ సిహెచ్ చలం రెడ్డి, బాబురెడ్డి, ముర్తుజావలి, ఖాజాహుసేన్, గూని నాగరాజు, కన్వీనర్లు తిరుమలేశ్వర్ రెడ్డి, ఖాజా, గొర్మానుకొండ గ్రామ సర్పంచ్ కోడె వెంకటేశ్వర్లు, మనురెడ్డి, సూర్య బళ్లాని, మధుసూదన్ రెడ్డి, వలీబాష, ఎం. రామానాయుడు, కృష్ణ మూర్తి, అల్లాబకష్, నిరంజన్ నక్కరివి, ఎర్రమల, ఆనంద్, వెంకటరాముడు, నూర్ కమల్, రాఘవరెడ్డి, హనుమాన్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News