Saturday, April 12, 2025
HomeదైవంEmmiganuru: బియ్యపు గింజపై అయోధ్య రామ మందిరం

Emmiganuru: బియ్యపు గింజపై అయోధ్య రామ మందిరం

కళాకారుడి కళా తృష్ణకు ఇదే గీటు రాయి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం మిలటరీ కాలనీకు చెందిన బారికి చంద్రశేఖర్ ఉత్తమ ప్రతిభను చాటారు. బియ్యపు గింజపై పెయింటింగ్ తో అయోధ్య రామ మందిరంను వేసి, తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ మందిరం ప్రాణ ప్రతిష్ట దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కళాకారులు వివిధ రకాలుగా కళాకారులు వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బారికి చంద్ర శేఖర్ సూక్ష్మ కళాకారుడిగా ఎన్నో అద్భుతమైన చిత్రాలను వేసి, అబ్బుర పరిచాడు. బియ్యపు గింజపై అయోధ్య రామ మందిరంను పెయింటింగ్ వేయడం పట్ల పలువురు అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News