Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో వేద శ్రవణం

Srisailam: సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో వేద శ్రవణం

శ్రీశైల మహా క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేద శ్రవణం నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా సేవలన్నీ పరిపూర్ణంగా జరిపించాలనే భావనతో ఈ వేద శ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేవస్థానం వేదపండితులతో పాటు పలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 38 మంది వేద పండితులు కూడా ఈ కార్యక్రమములో పాల్గొంటున్నారు. కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి – విజయవాడ దేవస్థానాల నుంచి వచ్చిన వేద పండితులతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన పలువురు వేదపండితులు కూడా ఈ కార్యక్రమములో వేదపారాయణం చేస్తున్నారు.
అమ్మవారి ఆలయ ప్రాంగణములో వేదపఠన కార్యక్రమం జరిగింది. దాదాపు 3 గంటలపాటు నిరంతరాయంగా ఈ వేదపారాయణలు కొనసాగాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News