Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్4 BRS MLAs met CM Revanth: సీఎం రేవంత్ తో భేటీ అయిన...

4 BRS MLAs met CM Revanth: సీఎం రేవంత్ తో భేటీ అయిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

మర్యాదపూర్వక భేటీనే అంటున్నారు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవటం సంచలనం సృష్టిస్తోంది. బీఆరెస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక) , గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్ చెరు) , మాణిక్ రావు (జహీరాబాద్) రేవంత్ తో భేటీ అయిన ఎమ్మెల్యేలు. అయితే ఇదంతా మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ మాత్రమేనని పైకి ఆ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి మాటలు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపాయి. లోక్ సభ ఎన్నికల తరువాత 30 మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నట్టు కోమటిరెడ్డి వెల్లడించిన మరుసటి రోజే ఇలా గులాబీ ఎమ్మెల్యేలు రేవంత్ ను ఏకంగా ఆయన నివాసంలో కలవటం గులాబీ దళంలో నయా గుబులు పుట్టిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News