Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: కొమ్ము భూమయ్య అరెస్టు, రిమాండ్ కు తరలింపు

Karimnagar: కొమ్ము భూమయ్య అరెస్టు, రిమాండ్ కు తరలింపు

నకిలీ డాక్యుమెంట్లతో భూకబ్జా కేసులో..

కరీంనగర్ లోని చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన దీటీ మధు, తండ్రి లక్ష్మీరాజం, వయసు 45 సంవత్సరాలు, వృత్తి :ఎలక్ట్రిషన్, అనునతను 2013 సంవత్సరంలో ఆరెపల్లి గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 311, ఓపెన్ ప్లాట్ నంబర్.5 లో గల 91 గజాల ఇంటి స్థలాన్ని కరీంనగర్ కు చెందిన నల్లవెల్లి రాజు, తండ్రి మాంకాలయ్య నుండి ఖరీదు చేశాడు. ఇట్టి స్థలాన్ని ఇంటి నిర్మాణం కొరకై తన భార్య అయిన ఎండల సరిత పేరున మార్చాడు. 2013 నుండి ఇట్టి స్థలము వారి ఆధీనంలోనే ఉంది. పై తెలిపిన స్థలంలో మున్సిపాలిటీ ద్వారా అనుమతి తీసుకొని, ఇంటి నంబర్ 4-63/A/A/2/A/1 నిర్మించుకున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు గుంజ లక్ష్మణ్ అనే వ్యక్తి అక్రమంగా, తన ఇంటిలో చొరబడి తనకున్న ఆ ఇంటిని కాజేయాలనే నేరపూరిత కుట్రతో, ఇంటి గేటుపై ఉన్నటువంటి ఇంటి నెంబర్ ప్లేట్ ని తొలగించి మరొక ఇంటి నెంబర్ 1-42/6/E/4/A/1 గల ప్లేటును తగిలించి, పైన తెలిపిన ఇంటి స్థలం తనదని, ఇట్టి స్థలాన్ని తను తీగుట్టపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ అయిన కొమ్ము భూమయ్య వద్ద నుండి కొనుగోలు చేశాడని వాగ్వివాదానికి దిగాడని, అంతేకాకుండా ఇంటిని వదిలి వెళ్లాలని, లేనియెడల చంపుతామని బెదిరింపులకు కూడా పాల్పడ్డారని గత నెల 31వ తేదీ బుధవారం నాడు దీటి మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ Cr. No. 69/2024 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

- Advertisement -

పై కేసులో విచారణ జరిపిన కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్, తీగలగుట్టపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య మరియు గుంజ లక్ష్మణ్ వ్యక్తులిద్దరూ దీటి మధుకు చెందిన ఇంటిని కాజేయాలని దురుద్దేశంతో నేరపూరిత కుట్రను పన్ని సర్పంచ్ మరియు పంచాయతీ సెక్రెటరీ యొక్క సంతకాలను ఫోర్జరీ చేసి అదే ఇంటి స్థలంపై నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారని తేలింది. పై చర్యలకు పాల్పడి, దీటి మధు అనే ఫిర్యాదుదారుని ఇంటిని కాజేయాలని నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అక్రమంగా ఇంట్లో చొరబడి, దౌర్జన్యానికి పాల్పడి ఇంటి నెంబర్ తొలగించినందుకు, ఇంటి యజమానిని చంపుతానని బెదిరించినందుకుగాను కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు Cr. No. 69/2024, U/Sec 420, 465,467,471,447,427,506,120-b r/w 34 IPC పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ముద్దాయిలను గౌరవ కోర్టు నందు హాజరుపరచగా కేసు పూర్వాపరాలు పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి (ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్) ముద్దాయిలకు 15 రోజుల రిమాండ్ విధించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News