Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Bandiatmakuru: వైసిపికి మరో భారీ షాక్

Bandiatmakuru: వైసిపికి మరో భారీ షాక్

టిడిపిలో చేరిన 50 కుటుంబాలు

బండిఆత్మకూరు మండలంలోని చిన్న దేవలాపురం గ్రామములో వైఎసార్సీపీకి చెందిన మాజీ ఎంపిటిసి తెల్లపూరి నారాయణ అధ్వర్యంలో గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నియంతృత్వ పోకడలకు విసుగుచెంది, అభివృద్ధి లేని మీ సంక్షేమ ఫథకాలు మాకొద్దని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే బుడ్డా టిడిపి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి మాట్లాడుతూ వైసిపీ ప్రభుత్వంతో కార్యకర్తలు విసుగుచెంది టిడిపిలోకి భారీగా వలసలు జరుగుతున్నాయని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేసారు. ఈ చేరికలలో పసుపుల మహేష్, గుండు గారి వెంకటేశ్వర్లు, తెల్లపూరి ఈశ్వరయ్య ( మాజీ సర్పంచ్ ), లక్ష్మన్న, శివ శంకర్, శివయ్య, రాజు, దాసరిమౌళా ( గృహసారధి), శివ కృష్ణాలతో పాటు మరికొన్ని కుటుంబాలు చేరారని తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News