Thursday, September 19, 2024
HomeతెలంగాణSirisilla: పోలీసుల కస్టడీలో కోల ప్రశాంత్, సుదగోని కృష్ణ గౌడ్, ఏలేటి భరత్ రెడ్డిలు

Sirisilla: పోలీసుల కస్టడీలో కోల ప్రశాంత్, సుదగోని కృష్ణ గౌడ్, ఏలేటి భరత్ రెడ్డిలు

సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శివసాయినగర్ కు చెందిన గునుకుల రాజిరెడ్డికి రేకుర్తికి చెందిన భూమి యొక్క నకిలీ ధృపత్రాలు నిజమైనవిగా చూపించి, వివాదాల్లో ఉన్నటువంటి భూమిని చూపి అక్రమంగా కోటి ముప్పై ఏడు లక్షల రూపాయలు వసూలు చేసినందుకు గాను బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకొని, జరిపిన విచారణలో వారిపై ఆరోపణలు నిజమైనవిగా గుర్తించి ఈ నెల 09 వ తేదీ శుక్రవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచగా గౌరవ కోర్టు నిందితులు ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించి, జైలుకు తరలించిన విషయం విధితమే.

- Advertisement -

ఇదిలా ఉండగా ఈ కేసులో జైలులో నిందితులుగా ఉన్న ముగ్గురైన 17వ డివిజన్ కార్పొరేటర్ భర్త కోల ప్రశాంత్, 18 వ డివిజన్ కార్పొరేటర్ భర్త కృష్ణ గౌడ్, ఏలేటి భరత్ రెడ్డి లను పై కేసుకు సంబంధించి మరింత కీలక సమాచారం సేకరించేందుకు కోర్టు ద్వారా అనుమతి మేరకు ఈరోజు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి రేపు శనివారం మధ్యాహ్నం 10 గంటల వరకు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ పోలీస్ కస్టడీకీ తీసుకున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా పోలీస్ కస్టడీలోకి తీసుకున్న నిందితుల కరీంనగర్ లోని ముగ్గురి ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు తెలిసింది. ఇట్టి సోదాల్లో నమోదైన కేసుకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను లభించాయని వాటిని కరీంనగర్ రూరల్ పోలీసులు స్వాధీన పరుచుకున్నారని సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News