Friday, September 20, 2024
HomeతెలంగాణRevanth Reddy: గత ప్రభుత్వ నిర్ణయాలు కొనసాగిస్తాం

Revanth Reddy: గత ప్రభుత్వ నిర్ణయాలు కొనసాగిస్తాం

ప్రభుత్వంపై అపోహలు వద్దన్న సీఎం

నానక్ రామ్ గూడలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నానక్ రామ్ గూడలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదం జరిగినపుడు అందరికంటే ముందుండేది ఫైర్ డిపార్ట్ మెంట్, ప్రజల రక్షణ కోసం ఫైర్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతారన్నారు. ప్రపంచంతో హైదరాబాద్ నగరం పోటీ పడుతోందని, నగరంలో శాంతి భద్రతలు సరైన విధంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు.

- Advertisement -

హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమన్న సీఎం, గత ముప్పై ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కొనసాగిందన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే…. మరింత ఉన్నతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.. తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకొస్తామన్నారు.

త్వరలో 2050 మెగా మాస్టర్ ప్లాన్ తీసుకు రాబోతున్నాం, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు భాగాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళతామని రేవంత్ వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని 25వేల ఎకరాల్లో హెల్త్, స్పోర్ట్స్, కాలుష్య రహిత పరిశ్రమలతో ఒక సిటీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. మెట్రో రద్దు కాలేదు.. ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో విస్తరణ చేయబోతున్నాం.. ఫార్మా సిటీలు కాదు.. ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేస్తాం.. అపోహలు వద్దు.. మా ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందని తెలిపారు.

మాకు మేమే మేధావులమని భావించం.. అనుభవజ్ఞులు, నిపుణుల సలహాలతో ముందుకెళతామన్నారు. గతంలో సృష్టించిన సమస్యలను పరిష్కరిస్తూ… భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకెళతామని, ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మా విధానమని, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేద

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News