Thursday, September 19, 2024
HomeతెలంగాణKommuri: బిఆర్ఎస్ పార్టీ ఖాళీ

Kommuri: బిఆర్ఎస్ పార్టీ ఖాళీ

మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి

పార్లమెంట్ ఎన్నికలు రావడానికి ముందే బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. బిఆర్ఎస్ కౌన్సిలర్ ఆడెపు నరేందర్ ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆడెపు చంద్రయ్య కుమారులు ఆడెపు మహేష్,చేర్యాల్ పట్టణ మాజీ గ్రంథాలయ చైర్మన్ నాగుల వెంకటేష్ పెద్ద ఎత్తున రెండు వందల మందితో పార్టీ కండువ కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్, జనగామ జిల్లా యూత్ అధ్యక్షులు బనుక శివరాజ్, పిఎస్సిఎస్ డైరెక్టర్ కొమ్ము రవి, పుర్మఆగంరెడ్డి పట్టణ అధ్యక్షులు మంచాల చిరంజీవిలు, మంజ మల్లేశం ముస్త్యాల యాదగిరి రంగు శివ శంకర్ గౌడ్, తాళ్లపల్లి వెంకటేష్ గౌడ్, రఘువీర్ కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు కర్క సంతోష్ రెడ్డి భూమని బాలరాజు, వినీత్, గద్దల మహేందర్, తాళ్లపల్లి వీరేందర్, ఎర్రబచల శ్రీకాంత్, జిల్లా నాయకులు మండల నాయకులు మండల యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News