Saturday, April 19, 2025
HomeతెలంగాణMedaram Jatara: మేడారం జాతరలో పాముకాటుకు గురైన మహిళ

Medaram Jatara: మేడారం జాతరలో పాముకాటుకు గురైన మహిళ

చికిత్స అందించిన మేడారం వైద్య సిబ్బంది

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం వచ్చిన ములుగు జిల్లాకు చెందిన కాసెట్టి లక్ష్మి పాము కాటు గురైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అయితే పాముకు కటుకు గురైన లక్ష్మిని వెంటనే సంబంధిత కుటుంబ సభ్యులు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత వైద్యులు పరీక్ష చేసి తగిన చికిత్స అందించడంతో లక్ష్మికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. సిబ్బంది తగిన చికిత్స అందించడం తో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News