Saturday, October 5, 2024
HomeతెలంగాణHuzurabad: తులాభారంలో ఎమ్మెల్యే కుటుంబం

Huzurabad: తులాభారంలో ఎమ్మెల్యే కుటుంబం

బరువెత్తు బంగారం సమర్పించిన ఎమ్మెల్యే ఫ్యామిలీ

సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సమేతంగా తులాభారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమ్మక్క సారలమ్మ మొక్కులో భాగంగా ఎత్తు బంగారం ఇచ్చామన్నారు.

- Advertisement -

నియోజకవర్గంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వనదేవతలను వేడుకున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలంతా సమ్మక్క సారలమ్మ జాతరను కుటుంబ సభ్యులతో సంతోషంగా చేసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో వసతులు సరిగా చూసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి శాలినీ రెడ్డి, కూతురు శ్రీనిక రెడ్డి, ఎమ్మెల్యే సోదరుడు కార్తీక్ రెడ్డి, కూతురు ఆదితో పాటు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News