Wednesday, April 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Srisailam: నందీశ్వర స్వామికి విశేష పూజ

Srisailam: నందీశ్వర స్వామికి విశేష పూజ

లోక కళ్యాణం కోసం దేవస్థానం ఈరోజు ఆలయ ప్రాంగణం లోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామి వారికి) విశేష అర్చన మరియు అభిషేకం నిర్వహించారు. మంగళవారం, త్రయోదశి రోజున దేవస్థానం సర్కారీ సేవగా ఈ కైకర్యం జరిపిస్తుంది. ప్రదోష కాలంలో అనగా సాయ సంధ్యా సమయంలో ఈ విశేష పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాలు అన్నీ కూడా లోక క్షేమాన్ని కాంక్షిస్తూ.. దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చక స్వాములు వేద పండితులు సంకల్పం చెప్పి ఈ విశేష పూజలు జరిపిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News