Saturday, April 19, 2025
HomeతెలంగాణChegunta: మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం

Chegunta: మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం

వేసవిలో నీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశాలు

నార్సింగి మండల కేంద్రంలో పెద్దమ్మ గుడి ఆలయం వద్ద సిసి రోడ్డు పనులు, పలు అభివృద్ధి పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేసిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ జిల్లా నుండి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి, ఢిల్లీకి పంపించాలని, ఢిల్లీలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి మన వాణి ఢిల్లీ వరకు వినిపించగలుగుతామన్నారు. రాష్ట్రంలో-కేంద్రంలో మన ప్రభుత్వమే ఉంటే మనం ఏ పని అయినా చేసుకోవచ్చన్నారు. స్థానిక సమస్యలను ప్రస్తావించిన ఆయన.. ఎండాకాలం కాబట్టి ప్రతి గ్రామానికి త్రాగు నీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, నార్సింగి గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News