Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Chennakesava Reddy: వైసీపీ విజయం ఖాయం

Chennakesava Reddy: వైసీపీ విజయం ఖాయం

బుట్టాను గెలిపించుకుందామన్న ఎమ్మెల్యే

వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు YCP అభ్యర్థి బుట్టా రేణుక భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సూచించారు. స్థానిక కుర్ణీ కళ్యాణ మంటపంలో ఎమ్మిగనూరు మండల వైసిపి నాయకులు కార్యకర్తలు పరిచయ కార్యక్రమం జరిగింది. బుట్టా రేణుకను చెన్నకేశవ రెడ్డి ఎమ్మిగనూరు మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, జేసీఎస్ కన్వీనర్లకు పరిచయం చేశారు. 

- Advertisement -

బీసీకే టికెట్ అని జగన్ చెప్పారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా YCP కర్నూలు జిల్లా కో ఆర్డినేటర్, ఎంఎల్సి రామసుబ్బారెడ్డి, ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ డాక్టర్. మధుసూదన్, నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, పాల్గొన్నారు. ఎమ్మిగనూరు సీటు బీసీలకు కేటాయిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. అందుకు తాము అంగీకరించామన్నారు. ఆమె విజయానికి తాము కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో మళ్లీ వైఎస్సార్సీపీ విజయానికి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో సమిష్టిగా కృషి చేద్దామని ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక సూచించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు బుట్టా శివ నీలకంఠ, బుట్టా ప్రతుల్ ఎంపీపీ గొల్ల కేశన్న, నాయకులు బిఆర్ బసిరెడ్డి, జానకీరామి రెడ్డి, కోటేకల్ లక్ష్మన్న, కడివెళ్ళ రంగస్వామి ,వినయ్ రెడ్డి పార్లపల్లి నారాయణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News