Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Bandi Athmakuru: వలసలు ఆపగలవా, శిల్పాకు బుడ్డా సవాల్

Bandi Athmakuru: వలసలు ఆపగలవా, శిల్పాకు బుడ్డా సవాల్

నీవెన్ని ప్రయత్నాలు చేసినా..

మండలంలోని కడమల కాల్వ గ్రామానికి చెందిన వైసిపి నాయకురాలు కలసపాటి హరి ప్రియతో పాటు నాయకులు మదన సురేష్, రాజు, జయ రాజు, నాగరాజు, మధు మాబు, అక్బర్ వలి తదితరులతో పాటు సుమారు 40 కుటుంబాలు మండల TDP కార్యాలయం నందు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే బుడ్డా కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బుడ్డా మాట్లాడుతూ మండలంలో ప్రజలు, కార్యకర్తలు వైసీపీ పోకడలకు విసుగు చెంది, తెలుగుదేశం పార్టీలో చేరడం శుభపరిణామం అన్నారు. మొన్న నారాయణాపురం, నిన్న చిన్నదేవళాపురం, నేడు కడమలకాల్వ, రేపటి నుండి ఇంకెన్ని గ్రామాల్లో మా పార్టీ చేరుతారో తేదీ, టైం చెపుతాను ఆపుకోగలవా! నీవెన్ని ప్రయత్నాలు చేసిన వలసలను నివారించడం నీతరం కాదన్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News