Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kosigi: ప్రజాబలం ఉన్న లీడర్ తిక్కారెడ్డి

Kosigi: ప్రజాబలం ఉన్న లీడర్ తిక్కారెడ్డి

టిడిపి కార్యకర్తల మండల సర్వసభ్య సమావేశం

మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజాబలం ఉన్న నాయకుడు తిక్కారెడ్డేనని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంత్రాలయం టిడిపి అభ్యర్థిగా పార్టీ తరఫున నిలబడి ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన వస్తుందని టిడిపి మండల కన్వీనర్ జ్ఞానేశ్ అన్నారు. స్థానిక బీరప్ప దేవాలయంలో టిడిపి కార్యకర్తల మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి జరగలేదని, ఒక్క అవకాశం ఇమ్మని ప్రజలను అడిగి రాజధాని లేని రాష్ట్రంగా జగన్ చేశాడన్నారు. మరో అవకాశం ఇస్తే రాష్ట్రమే లేకుండా చేస్తారన్నారు. నియోజకవర్గంలో టిడిపి పార్టీ సభ్యత్వం లేని వారు కూడా ఈరోజు ఎమ్మెల్యే టికెట్ అడగడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికలు వస్తున్న సమయంలో ఇలా తిక్కారెడ్డిని ఇబ్బందులు చేయటం సర్వసాధారణమని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాబోయే ఎన్నికల్లో తిక్కారెడ్డి టిడిపి పార్టీ నుండి విజయం సాధిస్తారన్నారు. గత 15 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ప్రజాబలం కలిగిన నాయకుడు తిక్కారెడ్డేనని ఏ అవసరం వచ్చినా పార్టీలకతీతంగా సహాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తి అనీ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టిడిపి ఆధ్వర్యంలో ఏ చిన్న సమావేశం, మీటింగ్ జరిగిన భారీఎత్తున విజయవంతం చేస్తాడన్నారు. చంద్రబాబు నాయకుడుతోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక విజన్ కలిగి ఉన్న నాయకుడు చంద్రబాబేనన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వక్రాణి.వెంకటేశ్వర్లు , నాడుగేని. అయ్యన్న , భరద్వాజ్ శెట్టి , కొండగేని.వీరారెడ్డి , మహాదేవ , పంపాపతి , ఉమర్ సాబ్ , కలందర్ , సాతనూరు కోసిగయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News