Saturday, October 5, 2024
HomeదైవంSrisailam: మల్లన్న హుండీ ఆదాయం 6 కోట్లకు పైమాటే

Srisailam: మల్లన్న హుండీ ఆదాయం 6 కోట్లకు పైమాటే

విదేశీ కరెన్సీ, బంగారు, వెండి కూడా

శ్రీశైలం మల్లన్న హుండీల ద్వారా దేవస్థానానికి రూ. 5,62,30,472/- నగదు రాబడిగా లభించింది.
అలాగే ఈ హుండీలో 398 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారు, 7 కేజీల 950 గ్రాముల వెండి లభించాయి. 1989 – యుఎస్ఏ డాలర్లు, 305 – కెనడా డాలర్లు, 30- ఆస్ట్రేలియా డాలర్లు. 25 – ఇంగ్లాండు ఫౌండ్స్, 56 సింగపూర్ డాలర్లు, 10- కువైట్ దినార్స్, 30- యుఏఈ దిర్హమ్స్, 60 – ఈరోస్, 10- మలేషియా రింగిట్స్, 15 కత్తార్ రియాల్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.

- Advertisement -


పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ రవణమ్మ, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News