Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్Kautalam: వైభవంగా మారేమ్మ అవ్వ దేవాలయం ప్రారంభోత్సవం

Kautalam: వైభవంగా మారేమ్మ అవ్వ దేవాలయం ప్రారంభోత్సవం

50,000 విరాళమిచ్చిన తిక్కారెడ్డి

కౌతాళం మండలం రౌడురు గ్రామంలో మారేమ్మ అవ్వ దేవాలయం ప్రారంభోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

అనంతరం ఆలయం అభివృద్ధికి మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి 50 వేలు రూపాయలు విరాళం ఇచ్చారు. ఆ విరాళాన్ని ఆలయ పెద్దలకు యువనేత పాలకుర్తి దివాకర్ అందజేశారు.. అనంతరం గ్రామ పెద్దలు నాయకులకు శాలువా పూలమాలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చేన్నబసప్ప, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు, యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి రాజాబాబు, బుడదోడ్డి, ఈరన్న, జేటప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News