Saturday, September 28, 2024
HomeదైవంAhobilam: అహెూబిలంలో వైభవంగా 'స్వాతి' వేడుకలు

Ahobilam: అహెూబిలంలో వైభవంగా ‘స్వాతి’ వేడుకలు

స్వాతి వేడుకల్లో ఎమ్మెల్సీ గంగుల దంపతులు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొన్నారు . ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాలతో పాటు నవ నరసింహ క్షేత్రాలలో భక్తులుపాల్గొని పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలోని ప్రహ్లాద వరదస్వామి, ఎగువ అహోబిలంలోని జ్వాల నరసింహ స్వామి సన్నిధిలో వేద పండితులు స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలోని ప్రహ్లాద వరద స్వామి ఆలయంలో స్వాతి సందర్భంగా సుదర్శన హెూమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి గంగుల ఇంద్రారెడ్డి ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న వారికి ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. వారు స్వాతి వేడుకల్లో పాల్గొన్నారు. మఠం ప్రతినిధి సంపత్ ఓ ఎస్ డి శివప్రసాద్ మండల వైస్ ఎంపీపీ నా సారి లక్ష్మి నరసింహ ప్రసాద్ వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News