Saturday, September 28, 2024
HomeతెలంగాణVemulavada: బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభ విజయవంతం చేయండి

Vemulavada: బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభ విజయవంతం చేయండి

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చీఫ్ గెస్ట్ గా..

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా చేపట్టిన విజయ సంకల్ప యాత్ర తెలంగాణ రాష్ట్రంలో క్లస్టర్ వారీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాత్రలోని శ్రీ రాజరాజేశ్వర క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర శనివారం వేములవాడలో పట్టణంలో ముగుస్తుంది. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ యాత్ర వివరాలు వెల్లడించారు.

- Advertisement -

వేములవాడలో నేడు జరుగనున్న ముగింపు యాత్రకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్, శాసన సభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు హాజరవుతున్నారని, ఈ యాత్రలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంకల్పయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News