Thursday, April 10, 2025
HomeదైవంMahanandi: భక్తులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాలి

Mahanandi: భక్తులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాలి

గ్లౌజులు వేసుకుని వడ్డించండి

భక్తులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాలని మహానంది దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మహానంది దేవస్థానం కార్యాలయంలో వివిధ కుల సంఘాలకు చెందిన అన్నదాన సత్రం కమిటీ సభ్యులతో సమావేశ నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు అన్నదానం చేసేచోట పరిశుభ్ర వాతావరణంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్లౌజులు ధరించి వడ్డించాలని, వీలైనంతగా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, జూనియర్ అసిస్టెంట్ మల్లయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News