ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నేత బంగారు శృతి. ఈ వార్త చూస్తుంటే బీజేపీ నుంచి మరో వలస పక్షి కాంగ్రెస్ గూటికి చేరటం ఖాయంగా మారింది. దీంతో అసలు బీజేపీలో ఏం జరుగుతోందని, కమలంలో ముసలం వివరాలపై అందరూ ఆసక్తిగా ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. దాదాపు 5 దశాబ్దాలపాటు బీజేపీకి వివిధ హోదాల్లో సేవలు అందించిన బంగారు లక్ష్మణ్ కుమార్తె లోక్ సభకు పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుని, తాజాగా సీఎం రేవంత్ ను కలవటం చూస్తుంటే తెలంగాణలో కమలం పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థమవుతోంది.
Bangaru Shruthi in Cong?: బీజేపీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ లోకి బంగారు శృతి?
తెలంగాణ బీజేపీలో పెద్ద ముసలం!
సంబంధిత వార్తలు | RELATED ARTICLES