Saturday, October 5, 2024
HomeతెలంగాణBasheerabad: సర్కారు భూముల్లో జోరుగా మైనింగ్

Basheerabad: సర్కారు భూముల్లో జోరుగా మైనింగ్

గనులపై కొరడా ఝుళిపించిన అధికారులు

బషీరాబాద్ మండలo ఎక్మయి గ్రామ శివారులో సర్కారు భూముల్లో ఉన్న రాతి నిక్షేపాలను ఉల్లంగిస్తూ దర్జాగా దోపిడీ చేస్తున్నారు. తాసిల్దార్ వెంకటేష్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆరు మంది కార్మికుల మిషన్ల దగ్గర కటింగ్ మిషన్ల బ్లేడ్లను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు వారికి మీకు ఎలాంటి అనుమతులు ఉన్న మాకు పత్రాలు చూయించమని అడగగా, తికమకైన కార్మికులను గమనించిన అధికారులు ఆరు బ్లేడ్లను స్వాధీనం చేసుకొని తసీల్దార్ కార్యాలయానికి తరలించారు. అనుమతులు లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కార్మికులకు హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు నాపరాయి గనులపై కొరడా ఝుళిపించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాకేష్ , రెవెన్యూ బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News