Wednesday, June 18, 2025
HomeతెలంగాణChegunta: సహకార సంఘం చైర్మన్ మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే

Chegunta: సహకార సంఘం చైర్మన్ మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే

నార్సింగిలో విషాదం

మెదక్ జిల్లా, చేగుంట మండలం, నార్సింగి మండలానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ శంకర్ గౌడ్ గుండెపోటుకి గురై మృతి చెందారు. తన అన్న రాజా గౌడ్ కి ఇటీవలే గుండె ఆపరేషన్ జరిగింది, కాగా తన అన్నను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో మేడ్చల్ వద్ద ఆకస్మాటుగా తనకు గుండె పోటు రావడంతో శంకర్ గౌడ్ ను కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పత్రికి తరలించారు. అప్పటికే శంకర్ గౌడ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వారి నివాసంకు వెళ్లి, శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ నాయకుడిని కోల్పోయిందని అయన అన్నారు. దీంతో నార్సింగి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News