మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 2వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి రావణ వాహనంపై శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వరులు వీధుల గుండా గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/662dcff5-3a1c-43d9-a417-d27d4fbdab81-668x1024.jpg)
దేవస్థానం లోపల, నాలుగు మాడవీధుల్లో క్షేత్రబలి, అనంతరం కాలపూజలు, ఉత్సవాది జపానుష్ఠానములు, మూలమూర్తులకు, పరివార దేవతలకు ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ఓ కాపు చంద్రశేఖర్ రెడ్డి, సుధా కుమారి దంపతులు, దాతలు, అర్చకుల, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/d86fd957-16ef-4b31-9934-623798e40d0f-1024x768.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/efd70c04-dc65-42a7-9efd-fab5df0f8889-1024x585.jpg)