Thursday, April 10, 2025
Homeనేషనల్Ultimatum: తగ్గేదే లే.. మధుశాలలో గోశాలలు ప్రారంభించేస్తాం.. ఫైర్ బ్రాండ్

Ultimatum: తగ్గేదే లే.. మధుశాలలో గోశాలలు ప్రారంభించేస్తాం.. ఫైర్ బ్రాండ్

లిక్కర్ షాపులను గోశాలలుగా మార్చేస్తానంటూ బీజేపీ అగ్గి బరాటా ఉమా భారతి సంచలన ప్రకటన చేశారు. ఆల్కహాల్ సేవనంతో మహిళలపై అఘాయిత్యాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని, కొత్త లిక్కర్ పాలసీ ప్రకటించే వరకూ తాను వేచి ఉండకుండా, మధుశాలలో గోశాలలు ప్రారంభించేస్తానని సొంత పార్టీ సర్కారుకు గట్టి హెచ్చరిక చేశారు ఉమాభారతి. మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆల్కహాల్ సేవనంపై ఎటువంటి నిషేధాలు విధించటం లేదంటూ ఉమా మండిపడుతున్నారు. ఈమేరకు ‘మధుశాలమే గో శాల’ అనే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం అయిన ఆమె.. గత నాలుగు రోజులుగా సర్కారు ప్రకటన కోసం వేచి చూసి చివరికి ఈరోజు ఈమేరకు సంచలన కామెంట్స్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News