Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: శివరాత్రి ప్రత్యేక పూజలు చేసిన నారా భువనేశ్వరి

Pathikonda: శివరాత్రి ప్రత్యేక పూజలు చేసిన నారా భువనేశ్వరి

మండగిరి కొండ శివారు ప్రాంతంలోని గుళ్లో..

జాతీయ మహిళా దినోత్సవం మహాశివరాత్రి రోజు రావడం మహిళలకు ఎంతో గొప్ప వరం అని నారా భువనేశ్వరి అన్నారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా పత్తికొండ మండల పరిధిలోని మండగిరి కొండ శివారు ప్రాంతంలో వెలసిన రామలింగేశ్వర శివుని విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శివుని పూజల్లో పాల్గొని రాష్ట్రం బాగుండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో సాయిబాబా ఆవరణంలో ఉన్న శివుడు పార్వతీ విగ్రహాలకు, వివిధ చోట్ల వెలిసిన శివుని పార్వతి దేవాలయాల్లో ఉపవాసాలతో మహిళలు, శివ భక్తులకు రోజంతా భక్తిశ్రద్ధతో ఉండి శివుని తత్వాలు చదువుతూ భక్తులు మునిగితేలారు.

- Advertisement -

శుక్రవారం రాత్రి దాదాపుగా భక్తాదులు నిద్రపోకుండా శివుని గురించి కథల కథలు చెప్పుకుంటూ కూర్చుంటారు. శివరాత్రి అనగా అతి ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటైన పండుగను దేశవ్యాప్తంగా భిన్నమైన సంప్రదాయాలతో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. భక్తులు ధ్యానం చేయటం, శివాలయాలను సందర్శిస్తారు. మంత్రం, పూజలు భక్తిపూర్వకంగా చేస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News