Friday, September 20, 2024
HomeతెలంగాణThangallapalli: ప్రజా పాలన ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తుంది

Thangallapalli: ప్రజా పాలన ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తుంది

ఎంపీటీసీ బైరినేని రాము

ప్రజా పాలన ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చిన్నలింగాపూర్ ఎంపీటీసీ బైరినేని రాము అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామంలో ఎంపీటీసీ బైరినేని రాము, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం రవీందర్ రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ మంద నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ బిల్లులను లబ్ధిదారులకు అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎంపిటిసి రాము మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేస్తుందని వెల్లడించారు. ప్రజా పాలనలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్ రమేష్, బొలవేని కనుకయ్య, మాసిని మాధవరెడ్డి, మంద చరణ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News