Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: ప్రచారంలో దూసుకుపోతున్న కేఈ శ్యాంబాబు

Pathikonda: ప్రచారంలో దూసుకుపోతున్న కేఈ శ్యాంబాబు

ఇంటింటా తిరుగుతూ ప్రచారం

దూదెకొండ గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ KE శ్యాంబాబు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన బాబు ష్యురిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ మండల పరిధిలో శ్యాంబాబు ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి కూటమిగా నిర్వహించిన సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో గురించి వివరిస్తూ, సమస్యల గురించి తెలుసుకుంటూ ఆయన తన యాత్రను కొనసాగిస్తున్నారు.

- Advertisement -

గతంలో తెలుగుదేశం పార్టీలో జరిగిన గ్రామ అభివృద్ధి ఇప్పుడు జరిగిన అభివృద్ధి గురించి తెలియజేస్తూ కచ్చితంగా పత్తికొండ ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని ఆయన అభ్యర్థిస్తున్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడును గెలిపించాలని గ్రామ ప్రజలకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ మండల టీడీపీ నాయకులు జనసేన పార్టీ సైనికులు దూదె కొండ గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News