Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: టిడిపిలోకి వైసీపీ కార్యకర్తలు

Nandyala: టిడిపిలోకి వైసీపీ కార్యకర్తలు

ఉడుమలపురం అభివృద్ధి చేసింది మేమే

నంద్యాల ఉడుమలపురం గ్రామంలో ఉన్న వైసిపి నాయకులు టిడిపిలో చేరినట్లు మాజీ మంత్రివర్యులు , నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఈ సందర్భంగా ఉడుమలపురం గ్రామంలో పైరెడ్డి శివ మోహన్ రెడ్డి , ex ఎంపీపీ జ్వాల తిరుమలేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు జ్వాల నాగేంద్ర , కేశవరెడ్డి , రాముతో పాటు 30 కుటుంబాలు మాజీ మంత్రివర్యులు, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించామన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ ఉడుమలపురం గ్రామాన్ని అభివృద్ధి చేసింది టిడిపి హయాంలోనే అని వైఎస్ఆర్సిపి హామీలకే పరిమితైందని అభివృద్ధికి నోచుకోని గ్రామాలు ఎన్నో ఉన్నాయని అటువంటి దానిని అభివృద్ధి చేయకుండా చేతుల దులుపుకుంటున్నారని .. ఉడుమలపురంలో తెలుగుదేశం పార్టీ హాయంలో ఎన్నో రోడ్లు , కాలువలు , లైటింగ్ స్తంభాలు తో పాటు ఎన్నో అభివృద్ధి పనులతో చేశామన్నారు. కానీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాల దగ్గర కావస్తున్న ఉడుమలపురం గ్రామానికి చేసిందేమీ లేదని వాపోయారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News