Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Gonegandla: మహిళా సాధికరతపై ఫోకస్ పెట్టిన ఏకైక నేత జగన్

Gonegandla: మహిళా సాధికరతపై ఫోకస్ పెట్టిన ఏకైక నేత జగన్

చేయూత లబ్దిదారులతో ఎమ్మెల్యే

మండల కేంద్రమైన గోనెగండ్లలో 4వ విడత వై యస్ ఆర్ చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పాల్గొని 4,351 మంది అక్కా చెల్లెమ్మలకు 8 కోట్ల 15 లక్షల 81 వేల రూపాయల చెక్కును అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ 45 నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళలకు సరైన ఆర్థిక చేయూతనిస్తే, వారి కుటుంబం తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని గట్టిగా నమ్మి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని అక్కా చెల్లెమ్మల కోసం వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతిఏటా ₹18,750 ఆర్థిక సాయాన్ని అందిస్తున్న ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్రంలోని మహిళలను తన సొంత అక్కచెల్లమ్మలుగా భావించి, అందరిలో వారి గౌరవాన్ని పెంచేలా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారికి తోడుగా ఉండేందుకు ఆర్ధికంగా సాయం చేస్తున్నారన్నారు.డ్వాక్రా రుణ మాఫీ చేసి, జగనన్న చేయూత, జగనన్న చేదోడు. ఇలాంటి అనేక పధకాలతో మహిళలకు డబ్బుని అందించి ఆ డబ్బుతో వారి కాళ్లపై వాళ్లు నిలబడేందుకు సాయం చేస్తున్న జగనన్న తన అక్కచెల్లెమల కలలను నెరవేర్చుతున్నామని గుర్తు చేశారు.

అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం వైయస్ జగన్ పాలన సాగుతోందనీ, అక్కచెల్లెమ్మలు వివిధ జీవనోపాధులు ఏర్పాటు చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడ్డారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో తాలుకా వైసీపీ నాయకులు బిఆర్. బసిరెడ్డి , ఎంపీపీ నసురుద్దీన్ , మండల యూత్ ప్రెసిడెంట్, బందేనావాజ్,  మండల కన్వీనర్, దొరబాబు, మండల వైస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, సోసైటి వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, పద్మనాభం, రఫీక్, నదీముల్లా, నాగలదిన్నె ముహమ్మద్, ఉల్చలా రంగన్న నాయుడు, వెంకటరెడ్డి, అధికారులు, ఈవోపిఆర్డి నాగేష్, ఎమ్మిగనూరు ఏసీ శ్రీనివాసులు, ఇన్చార్జి ఏపీం ముక్కన్న, సిసిలు లలితా రాణి, శకుంతల, వీర కృష్ణుడు, వెంగన్న, మధు, వివోఏలు, చేయుత లబ్దిదారులు, పొదుపు మహిళ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News