Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: వైయస్అర్ చేయూత చెక్కులు పంపిణీ

Emmiganuru: వైయస్అర్ చేయూత చెక్కులు పంపిణీ

మహిళలు అనుకుంటే ఏదైనా సాధ్యం

వచ్చే ఎన్నికల్లో కల్లిబోల్లి మాటలు చెప్పి మోసపూరిత మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేయడానికి టిడిపి, ప్రతిపక్షాలు వస్తాయని వారి మాటలు నమ్మి మోసపోవద్దు అని ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, వైకాపా సమన్వయ కర్త బుట్టా రేణుక అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో 4 విడత వైఎస్ఆర్ చేయూత చెక్కులను చెన్నకేశవ రెడ్డి, బుట్టా రేణుక చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 4,275 మందికి 8.02 కోట్లు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాదికి 45 ఏళ్ల నుండి 60 ఏళ్ల వయస్సు ఉన్న ఒక్కొక్క మహిళకు 18,750 రూపాయలు ఇస్తామన్నారు. మహిళలు అనుకుంటే ఏదైనా సాధ్యమేనని, జగనన్నకు మరోసారి పట్టం కట్టాలని కోరారు. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మి ఓటు వేస్తే నష్ట పోతామని హెచ్చరించారు.

- Advertisement -

కార్యక్రమంలో వైసిపి నాయకులు బుట్టా శివ నీలకంఠ, బీఅర్ బసిరెడ్డి, ఎంపీపీ గొల్ల కేశన్న, వైస్ ఎంపిపి పోలయ్య, ఎంపిడీఓ కొండన్న పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News