Saturday, September 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ప్రజలపై చెత్త పన్ను వేసిన ఘనత వైసిపిదే

Emmiganuru: ప్రజలపై చెత్త పన్ను వేసిన ఘనత వైసిపిదే

మాజీ ఎమ్మెల్యే బీవీ

ప్రజలపై చెత్త పన్ను వేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికే ఉందని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. స్థానిక 17 వ వార్డులో బాబు సురిటి భవిషత్తు కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా ను గెలిపించాలని కోరారు. వైకాపాను గెలిపించి పెద్ద తప్పు చేశారని గుర్తు చేశారు. అలాగే సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. కరపత్రాలను పంపిణీ చేశారు.

- Advertisement -

కార్యక్రమంలో టిడిపి నాయకులు జయన్న , కలిముల్లా , సుందర్ రాజు, కొండయ్య చౌదరి, రామదాసు గౌడ్, దయాసాగర్, రంగస్వామి గౌడ్,అంజి, వెంకటేష్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News