Sunday, September 29, 2024
Homeఆంధ్రప్రదేశ్Dhone: ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు

Dhone: ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు

ఫ్యాను గుర్తుకు ఓటేయండి

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి పట్టణంలోని 10, 11 వార్డులలో గడప గడపకు పర్యటించారు. ఈ సందర్భంగా బుగ్గన అర్జున్ మాట్లాడుతూ కొండపేటలో గడపగడపకు పర్యటిస్తుంటే ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు కనపడింది. ఐదేళ్ల తర్వాత అడుగుపెట్టిన వాళ్లలో ఎటువంటి నిరాశ కనపడలేదు. ప్రతి ఒక్కరూ ఉత్సాహం కనిపించింది, అలాగే ప్రతి ఇంటింటికి వెళ్ళి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ మరల గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక భారీ మెజారిటీతో ముచ్చటగా మూడోసారి బుగ్గన రాజా రెడ్డిని గెలిపించాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News