Saturday, October 5, 2024
HomeదైవంKautalam: కౌతాళంలో కన్నుల పండుగగా దేవర ఉత్సవాలు

Kautalam: కౌతాళంలో కన్నుల పండుగగా దేవర ఉత్సవాలు

మారి కంబాదేవి ఉత్సవాలు

మండల కేంద్రమైన కౌతాళంలో వెలసిన గ్రామ దేవత మారి కంబాదేవి దేవర ఉత్సవాలు భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా నిర్వహించారు… భక్తులు కుంబాలతో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు…

- Advertisement -

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ పూజారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదం అందజేసి శాలువా పూలమాలతో సన్మానించి ఆశీర్వదించారు.. అనంతరం పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి గెలవాలని, ఈ సంవత్సరం బాగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండి ప్రజలు, రైతులు అందరు బాగుండాలని దేవిని కోరుకున్నట్లు తెలిపారు..

కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చేన్నబసప్ప , తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు, టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొట్రెష్ గౌడ్, టౌన్ అధ్యక్షులు కాశీ విశ్వనాధ్ ,, మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు టిప్పు సుల్తాన్, నాయకులు కురువ వీరేష్, కురుగోడు, రాజానంద్,దమ్ములదీన్నే రమేష్ గౌడ్,బాపురం వెంకట్ రెడ్డి, సిద్దు, కుంటనహాల్ దొడ్డనగౌడ,బదినెహల్ ఉమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News