Friday, September 20, 2024
HomeతెలంగాణSadasivapeta: పట్టణంలో ఆర్యవైశ్యుల సంబురాలు

Sadasivapeta: పట్టణంలో ఆర్యవైశ్యుల సంబురాలు

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు..

సదాశివపేట పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భమున సదాశివపేట ఆర్యవైశ్యులు సభ్యులు పట్టణ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ అధ్వర్యంలో సంబురాలు జరపుకున్నారు. రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి హృదయ పూర్వక అభినందనలు తెలియచేశారు.

- Advertisement -

తెలంగాణ ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహకు,టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు తూర్పు జయప్రకాశ్ రెడ్డికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మిఠాయిలు, బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మశెట్టీ ప్రకాశం , ఆలయ సంఘం అధ్యక్షుడు అనుముల సాయిరాజ్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమ్మ రమేష్ , ర్యగల్ల అశోక్, వోదేల రవి , గంప కృష్ణ ,తాటికొండ వైద్యనాధ్, కంది మల్లేశం , తంగెడ్పల్లీ లక్ష్మణ, చిల్లపల్లీ వెంకన్న , పురం కృపాకర్, పరిశ్యం బిక్షపతి , సరాప్ శీను, చంద్రం ,మల్లికార్జున సుధాకర్, జీర్లపల్లీ సంగమేష్ , గంప ప్రవీణ్ , నిజంపురం రవి , యువజన సంఘం సభ్యులు బిజ్జల సంపత్, మల్లికార్జున వంశీ , శంకర్ ,గణేష్ ,శివ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News