Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: విజయం టీడీపీదేనన్న ఫరూక్

Nandyala: విజయం టీడీపీదేనన్న ఫరూక్

జోరుగా ప్రచారం చేస్తూ..

నంద్యాల టౌన్ లో ఉన్న టిడిపి నాయకులతో నంద్యాల తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు మాజీ మంత్రి నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో లో ఉన్న సూపర్ సిక్స్ పథకాలను ప్రజలందరికీ తెలియజేయాలన్నారు . తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో వాటన్నిటినీ ప్రజలకు తెలియజేస్తూ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో వారికి రావాల్సిన నిధులను ఏ విధంగా దుర్వినియోగం చేసిందో వాటన్నిటిని ప్రజలకు తెలియజేయాలన్నారు. అలాగే ఓటు ప్రాధాన్యత గురించి ప్రజలకు తెలియజేస్తూ వారందరినీ చైతన్య పరచాలని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News