Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: దళిత వాడలను ధనిక వాడలు చేస్తాం

Bethamcharla: దళిత వాడలను ధనిక వాడలు చేస్తాం

శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న చిత్ర

టిడిపి యువ నాయకురాలు కోట్ల చిత్రమ్మ సీఎం జగన్ పై మండిపడ్డారు. ఈమేరకు ఆమె చేసిన ప్రచార కార్యక్రమాలు స్థానిక టీడీపీలో కొత్త జోష్ నింపుతున్నాయి. బేతంచెర్ల నగర పంచాయితి పరిధిలోని 7,13కౌన్సిల్ వార్డులలో టీడీపీ గెలుపుకోరుతూ విస్త్రత ప్రచారంలో పాల్గొన్నారు చిత్రమ్మ మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూనే, నిత్యం దళితులపై దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించరాు. బేతంచెర్ల నగర పంచాయతీ 7,13, కౌన్సిల్ నందు బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం టిడిపి పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి, మండల కన్వీనర్ ఉన్నం ఎల్ల నాగయ్య అధ్యక్షతన, 7,13, కౌన్సిల్ స్థానిక టిడిపి నాయకులు బుగ్గన మాధవి రెడ్డి, కాకర్ల తిరుమలేష్ చౌదరి,మయూరి సుబ్బారెడ్డి, భీమేశ్వరరెడ్డి,జాకిరుల్లా బేగ్,అరుణ్ బాబు, గూటం శివ, రామవరం శివ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న,టిడిపి యువ నాయకురాలు కోట్ల చిత్రమ్మ పాల్గొన్నారు.

- Advertisement -


డోన్ నియోజక వర్గం నుండి టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న , కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. దళిత వాడలను , ధనిక వాడలుగా తీర్చిదిద్దే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని వారన్నారు.

ఈ కార్యక్రమంలో కోట్ల గిరిధర్ రెడ్డి, జనసేన సైనికులు చల్ల మద్దిలేటి స్వామి, నాగరాజు, శ్రీ కంటి మధు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలోప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News