Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుSangareddy: సిగరెట్లల్లో డ్రగ్స్ నింపి ..

Sangareddy: సిగరెట్లల్లో డ్రగ్స్ నింపి ..

పదేండ్లుగా గుట్టుగా నడుస్తున్న వ్యాపారం

సంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం చెల‌రేగింది. పారిశ్రామిక వాడ‌లోని ఓ ప‌రిశ్ర‌మ‌లో ఇంట‌ర్‌పోల్ స‌మాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. బొల్లారం పారిశ్రామిక వాడలోని పీఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు 9 కోట్ల రూపాయల విలువచేసే 90 కిలోల మేపిడ్రీన్ డ్రగ్‌ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ప‌రిశీల‌న‌లో పది సంవత్సరాల నుంచి డ్రగ్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్లుగా తేలింది. ఈ వ్యవహారానికి సూత్రధారి అయిన కస్తూరి రెడ్డి అనే వ్యక్తిని డ్రగ్ కంట్రోల్ అధికారులు అరెస్టు చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో ఈ డ్రగ్‌ను పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. దీనిలో కొంతవరకు హైదరాబాద్ నగరంలో కూడా సప్ల‌య్‌ చేసినట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News