Sunday, September 29, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: శిల్పా కుటుంబానికి భారీ షాక్

Nandyala: శిల్పా కుటుంబానికి భారీ షాక్

దూరమైన వైసీపి నాయకులు

నంద్యాల టౌన్ 8వ వార్డు సంచి బట్టల వీధి సంబంధించిన శిల్పా కుటుంబానికి, శిల్పాకు అత్యంత ముఖ్య అనుచరులైన షబ్బీర్ , అలీ వారి ముఖ్య అనుచరులు 70 మంది 8వ వార్డు టిడిపి ఇంచార్జ్ ఉప్పరి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో టిడిపి జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి ఫిరోజ్ టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీని తమ ఆధీనంలో పెట్టుకొని నంద్యాలకు ఏమి చేయకుండా తన సొంత పనులకు వాడుకుంటున్నాడని అంతేకాకుండా శిల్పా వారి అనుచరులను విస్మరించడం వారిని దూరంగా పెట్టడం వారికి గౌరవం ఇవ్వకపోవడంతో వారు మనస్థాపం చెంది ఈరోజు టిడిపిలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

శిల్పా కుటుంబం ఎప్పుడు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ వారి నమ్ముకొని ఉన్న నాయకులను విస్మరిస్తూ ఉంటారన్నారు. ఇంకా 50 రోజులలో శిల్ప కుటుంబ పాలన నుంచి నంద్యాలకు విముక్తి లభిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నంద్యాలను నందనవనంగా చేస్తామన్నారు. నమ్ముకున్న వారికి అండగా ఉంటామని తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News