Sunday, September 29, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: జోరుగా ఫిరోజ్ ప్రచారం

Nandyala: జోరుగా ఫిరోజ్ ప్రచారం

సభలు, ర్యాలీలతో దేశం ప్రచార హోరు

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది ఒక చంద్రబాబుతోనే సాధ్యమని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలియజేశారు. ఈ సందర్భంగా నంద్యాల టౌన్ 17వ వార్డు విశ్వనగర్ నందు పర్యటనలో భాగంగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో యువతకు ఉపాధి కల్పించడంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విఫలమైందన్నారు.

- Advertisement -

నంద్యాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలందరూ వీటన్నిటినీ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వైసిపికి బుద్ధి చెప్తారన్నారు. అందుకోసమే విశ్వనగర్ అంతా ఏకమై విశ్వనగర్లో టిడిపికి మెజారిటీ తీసుకురావాలని అలాగే ప్రజలను చైతన్య పరిచి భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడుని సీఎంగా చేసుకొని నంద్యాల ఎమ్మెల్యేగా ఫరూక్ ని గెలిపించుకోవాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మద్దయ్య , లాయర్ ఖాజా హుస్సేన్ , చాందు రెబల్ , శీను , కృష్ణ , షరీఫ్ , గఫూర్ అంజి , కిషోర్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News