Sunday, September 29, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: వైసీపీలోకి 100 మంది

Emmiganuru: వైసీపీలోకి 100 మంది

బుట్టా రేణుక సమక్షంలో

ఎమ్మిగనూరు పట్టణంలోని మిలటరీ కాలనీకు చెందిన టిడిపి మహిళ అధ్యక్షురాలు గాజుల గోకారమ్మతో పాటు మరో 100 మంది టిడిపి నుండి వైసిపి లో చేరారు. స్థానిక శిల్పా ఎస్టేట్ కాలనిలోని వైకాపా కార్యాలయం వైసిపి అభ్యర్థి బుట్టా రేణుక సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. వైసిపి పట్టణ యూత్ అద్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ అధ్వర్యంలో గోకారమ్మ , పాండు, శివ కుమార్, చంద్రిక, లక్ష్మి, బొడి పద్మావతిలు వైసిపి కండువా వేసుకున్నారు.

- Advertisement -

ఈ సందర్బంగా బుట్టా రేణుక మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు బుట్టా శివ నీలకంఠ, బుట్టా ప్రథుల్, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News