Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: టిడిపిలో 100 మంది చేరిక

Emmiganuru: టిడిపిలో 100 మంది చేరిక

బీవీ జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో ..

ఎమ్మిగనూరు పట్టణం 12 వ వార్డుకు చెందిన ముస్లిం మైనారిటీ యువకులు దాదాపు 100 మంది వైసిపి నుండి టిడిపిలో చేరారు. స్థానిక బీవీ నివాసంలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. 12 వ వార్డుకు చెందిన వైసిపి మైనారిటీ యువ నాయకులు ఇంతియాజ్, నవాజ్, నిషార్, రహంతుల్లా, బడేసాబ్, రాఘవేంద్రతో పాటు మరో 100 మంది యువకులు చేరారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ రాష్ట్రంలో యువతను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యువతకు ఉపాధి కల్పించడంలో విఫలం చెందారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక రోడ్లపై పడ్డారు. యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి కల్పించే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందాం అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News