Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Emmiganuru: తల్లి కోసం కుమారుడి ప్రచారం, ఆకట్టుకుంటున్న ప్రతుల్

Emmiganuru: తల్లి కోసం కుమారుడి ప్రచారం, ఆకట్టుకుంటున్న ప్రతుల్

బుట్టా రేణుక గెలుపు కోసం ..

ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక విజయం కోసం ఆమె కుమారుడు బుట్టా ప్రతుల్ శ్రమిస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా కాళ్లకు బలపం కట్టుకుని నియోజకవర్గాన్ని చుట్టేస్తూ, రేయింబవళ్లూ వైసీపీ కార్యకర్తలతో ప్రతుల్ బిజీగా గడుపుతున్నారు. ఉన్నత చదువులు చదువుకుని, హైదరాబాద్ లో వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉన్న సంపన్న కుటుంబానికి చెందిన ప్రతుల్.. తన హోదాను, అంతస్తును పక్కనపెట్టి, సామాన్యులతో, కార్యకర్తలతో మమేకం అవుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. రాజకీయాల్లో చురుగ్గా కనిపిస్తున్న ఈ యువ నేత ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.

- Advertisement -

రాష్ట్రంలో జగనన్నకు పట్టాభిషేకం కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైసిపి యూత్ నాయకులు బుట్టా ప్రతుల్ అన్నారు. స్థానిక తేరు బజారులోని మార్కండేయ స్వామి దేవాలయం దగ్గర నుంచి 34 వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని వైసిపి ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైసిపి అభ్యర్థి బుట్టా రేణుక ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని అభ్యర్థించారు. జగన్ ను ముఖ్యమంత్రిగా చేసుకుందాం అని అన్నారు.

కార్యక్రమంలో కుర్ని కార్పొరేషన్ చైర్మన్ బుట్టా శారద, వైసిపి వార్డు ఇంఛార్జిలు విశ్వనాథ్ రమేష్, కోట కొండ నరసింహులు, కోరుశెట్టి విశ్వనాథ్, వడ్డే వీరేష్, బుట్టా రంగయ్య, మదు, శ్రీనివాసులు, బద్రీ, రఘువీర్, హర్ష పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News