Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్MLA Yennam: కెసిఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందే

MLA Yennam: కెసిఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందే

ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా మంది భాదితులు ఉన్నారని, తాను డీజీపీకి పిర్యాదు చేసినట్లు.. అందరూ ఫిర్యాదు చేయాలన్నారు ఎమ్మెల్యే ఎన్నం అన్నారు.. ప్రతీ జిల్లాలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి.. ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదులు స్వీకరించాలని, రాష్ట్రంలో వీళ్ల ఆగడలు తెలిసి కూడా.. కేంద్రంలో ఉన్న వ్యక్తులు మౌనంగా ఎందుకు ఉన్నారో అర్ధం కావడం లేదని ఎన్నం ఆరోపించారు. దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న చందంగా.. బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహరించాయన్నారు.

- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక.. మాజీ మంత్రి కేటీఆర్ మేకపోతు గంభీరం ప్రకటిస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాసిందేనంటూ ఆయన డిమాండ్ చేశారు. నవీన్ రావు, శ్రవణ్ రావు సర్వేంట్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేశారని, సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆయన భగ్గుమన్నారు. ఈ విషయంలో మీ ప్రమేయం లేకపోతే లై డిటెక్టర్ కు వస్తారా అని ఆయన సవాలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కెసిఆర్ ఎందుకు మాట్లాడటం లేదని, పదేండ్ల పాలనలో ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేశారన్నారు. శ్రవణ్ రావు, నవీన్ రావు ఫోన్ ట్యాపింగ్ తో వ్యక్తులను బెదిరించి వందల కోట్లు దండుకున్నారని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ వేసి.. లోతైన దర్యాప్తు చేయాలన్నారు.

ధరణిలో కొన్ని వందల ఎకరాలు నవీన్ రావు పేరుపై బదలాయించారని, నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. చెల్లి కవిత తీహార్ జైలుకు వెళ్తే.. కేటీఆర్ మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో చిందులు వేశారని ఆరోపించారు. అన్ని బాగున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబెర్స్ పోటీ చేయడం కాదు.. ఇప్పుడు ఎందుకు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ముగ్గురు కుటుంబ సభ్యులు మూడు చోట్ల పోటీ చేయాలని ఎన్నం డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News