Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Emmiganuru: మార్చి 31 న ఎమ్మిగనూరు చంద్రబాబు రాక

Emmiganuru: మార్చి 31 న ఎమ్మిగనూరు చంద్రబాబు రాక

బీవీజే ఆధ్వర్యంలో ప్రచారం

టిడిపి జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మార్చి 31 వ తేదీన ఎమ్మిగనూరు కు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, టిడిపి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి, కర్నూలు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి పంచలింగాల నాగరాజు తెలిపారు. స్థానిక తేరు బజారు , వెంకటాపురం స్పిన్నింగ్ మిల్లు సమీపంలో హెలిప్యాడ్ గ్రౌండ్ ను పరిశీలించారు. అంతకముందు బీవీ నివాసంలో మాజీ ఎమ్మెల్యే బీవీ, కర్నూలు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి పంచలింగాల నాగరాజు మీడియా తో మాట్లాడుతూ చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయాలని కోరారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత టిడిపిదేనన్నారు. కురువ కులానికి చెందిన పంచ లింగాల నాగరాజుకు టిడిపి ఎంపి టికెట్ ఇచ్చి గౌరవించిందని, వైసిపి పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. అందుకే వైసిపి ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

- Advertisement -

కార్యక్రమంలో టిడిపి నాయకులు సోగనూరు జగదీష్, నజీర్ అహ్మద్,సుందర్ రాజు,గోవిందు, దాదావలి,అంబేత్కర్, మిఠాయి నరసింహులు, మెకానిక్ నజీర్, హమాలీ ఉరుకుందు,వేంకటేశ్వర రెడ్డి, చెన్నాపురం నాగరాజు, నాగరాజు మాదిగ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News