Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Garla: మళ్లీ గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తా: సీతారాం నాయక్

Garla: మళ్లీ గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తా: సీతారాం నాయక్

గతంలో చేసిన పనులు గుర్తుచేసిన నేత

గతంలో ఎంపీగా పనిచేసిన కాలంలో మానుకోట పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని మేలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో నన్ను ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి ఏంటో పని చేసి చూపిస్తానని మాజీ ఎంపీ, బిజెపి ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ గా యూనివర్సిటీలో ఉన్న కాలంలో విద్యార్థులను ఏకం చేసి తెలంగాణ ఉద్యమం కోసం అనేక పోరాటాలు చేశామని, మాజీ సీఎం కేసీఆర్ తనకు టికెట్ ఇవ్వకుండా ఇతరులకు టికెట్ ఇచ్చి నాకు అన్యాయం చేశారని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బిజెపిలోకి వెళ్లినట్లు చెప్పారు. తాను ఎంపిగా ఉన్న కాలంలో జీవంచిపల్లి, పుల్లూరు అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి లు, బయ్యారంలో ఏకలవ్య పాఠశాల నిర్మాణంకు నిధులు మంజూరు చేసి నిర్మాణం చేశామని, పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల నిలుపుదలకు కృషి చేశామని, మానుకోటలో పాస్ పోర్ట్ కార్యాలయం, రామప్ప దేవాలయం అభివృద్ధి తదితర పనులు చేశానని చెప్పారు.

- Advertisement -

ఈ సమావేశంలో రాష్ట్ర మైనారిటీ మోర్చా కార్యదర్శి రావూక విమల్ కుమార్ జైన్,రాష్ట్ర నాయక్ రాంచంద్రు నాయక్,జిల్లా, నియోజకవర్గ,మండల నాయకులు నాయకులు శశివర్దన్ రెడ్డి,టి నాగరాజు, జంపాల శ్రీను, జస్వంత్ ఠాకూర్, ఎ.రాము, గుగులోత్ దేవా తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News