Saturday, October 5, 2024
HomeతెలంగాణHigh court: కేసీఆర్ కు షాక్.. సీబీఐ విచారణకు ఎమ్మెల్యేలకు ఎర కేసు

High court: కేసీఆర్ కు షాక్.. సీబీఐ విచారణకు ఎమ్మెల్యేలకు ఎర కేసు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందన్న కుంభకోణానికి సంబంధించి హైకోర్టులో సాగుతున్న విచారణలో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలకు ఎరలో సీబీఐ విచారణకే హైకోర్టు డివిజన్ బెంచ్ మొగ్గుచూపింది. హైకోర్టు సింగిల్ బెంచ్ సీబీఐ విచారణకు ఆదేశించగా దాన్ని సవాలు చేస్తూ కేసీఆర్ సర్కారు హైకోర్టు డివిజన్ బెంచ్ లో కేసు వేసింది. కానీ ఇప్పుడు డివిజన్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థిస్తూ సీబీఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో కేసీఆర్ సర్కారు షాక్ తింటోంది. తక్షణం సీబీఐకి ఎమ్మెల్యేల కొనుగోలు కుంభకోణం కేసును అప్పగించి విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News