Sunday, October 6, 2024
HomeతెలంగాణTelangana: సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, విద్యాలయాల్లో మెస్ చార్జీలపై మంత్రుల చర్చ

Telangana: సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లు, విద్యాలయాల్లో మెస్ చార్జీలపై మంత్రుల చర్చ

పెరుగుతున్న ద్రవ్యోల్భణానికి అనుగుణంగా విధ్యార్థులకు మరింత మెరుగైన పౌష్టికాహారం అందించడానికి రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్లు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో మెస్ చార్జీల పెంపుపై చర్చించారు, విధ్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించాలనే సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా శాఖా పరంగా ప్రభుత్వానికి పంపించే ప్రతిపాదనలపై చర్చించారు. సంక్షేమ శాఖల బడ్జెట్లో మెస్ చార్జీల కేటాయింపులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. అనంతరం ముగ్గురు మంత్రులు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును కలిసి వివరించారు, సావధానంగా విన్న ఆర్థిక శాఖ మంత్రి ప్రాథమికంగా సానుకూలంగా స్పందించారు.
బీసీ సంక్షేమ శాఖకు 6229 కోట్లు, పౌరసరఫరాల శాఖకు 3117 కోట్లు కేటాయించి, గతం కన్నా నిధులను పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News